images scrolling









>

AP NEWS

BREACKING NEWS
*
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం మొబైల్ నంబర్లు &ఇ.మెయిల్స్
1. శ్రీ ఎన్ .చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి మొబైల్ : 99635-10004&97057-10004

2.శ్రీ కె. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి. అటవీ పర్యావరణం శాఖ మొబైల్ : 93813-09696 pawan.k786@gmail.com

3. శ్రీ ఎన్. లోకేష్ ఐటి మానవ వనరుల శాఖ. విద్యాశాఖ మొబైల్ : 0863-2499999 lokeshnara@gmail.com

4. శ్రీ కె. అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ. సహకార మార్కెటింగ్ శాఖలు మొబైల్ : 94401- 96777 katchannaidu@gmail.com

5. శ్రీ కొల్లు రవీంద్ర గనులు జియాలజీ ఎక్సైజ్ శాఖ మొబైల్ : 99851-22254 kolluravindra@gmail.com

6. శ్రీ నాదెండ్ల మనోహర్ పౌరసరఫరాల శాఖ మొబైల్ : 98490-00006nadendalamanohar@ gmail.com

7.శ్రీ పి.నారాయణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మొబైల్ : 98481-72501narayanaponguru@ gmail.com

8. శ్రీమతి వంగలపూడి అనిత హోంశాఖ మొబైల్ : 80994-88888 90955-48888 anithavangalapudi@ gmail.com

9. శ్రీ సత్యకుమార్ యాదవ్ వైద్య విద్య ఆరోగ్యశాఖ మొబైల్ : 98105-09999& 74829-99999 satyaosd@gmail.com

10. శ్రీ ఎన్. రామానాయుడు జల వనరుల శాఖ మొబైల్ : 92477-31129 ramanaidunimmala@gmail.com


11. శ్రీ ఎన్.ఎం.డి.ఫరూక్ మైనారిటీ సంక్షేమం మొబైల్ : 98496-99920 ministerfarook@gmail.com

12. శ్రీ ఎ.రామనారాయణరెడ్డి దేవాదాయ ధర్మాదాయ శాఖ మొబైల్ : 98490- 48855&94412-20555 ananmramanarayanareddy139@gmail.com

13. శ్రీ పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ మొబైల్ : 98480-32984 payyavulakeshav@gmail.com

14. శ్రీ ఎ. సత్య ప్రసాద్ మొబైల్9120-77777&96764-47777anaganimla@hotmail.com

15. శ్రీ కె. పార్ధసారధి హౌసింగ్ సమాచార శాఖ.మొబైల్ : 98483-04112&96983-59999 nitinkrishna1811@gmail.com


16.శ్రీ డి. వీరాంజనేయస్వామి సాంఘిక సంక్షేమ శాఖ మొబైల్98491-94903doctorswamydola@gmail.com


17. శ్రీ జి. రవికుమార్ విద్యుత్ శాఖ మొబైల్ : 98485-25717 gravikumarmlaaaddanki@gmail.com


18. శ్రీ కందుల దుర్గేష్ టూరిజం సినిమాటోగ్రఫీ శాఖ మొబైల్ 91128-99999lakshmidurgesh@gmail.com


19. శ్రీ మతి జి.సంధ్యారాణి మహిళా శిశు, గిరిజన సంక్షేమ శాఖ.మొబైల్ : 94916-99633 sandhyatdp@gmail.com


20. శ్రీ బి.సి. జనార్ధనరెడ్డి రోడ్లు భవనాలు శాఖ మొబైల్ : 94944-94944& 94410- 43333bcjreddy2@gmail.com


21.శ్రీ టి.జి. భరత్ పరిశ్రమల వాణిజ్యం,ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మొబైల్ : 98483-59999 tgbharath@hotmail.com


22. శ్రీ మతి ఎస్.సవిత బీసీ వెల్ఫేర్ శాఖ. మొబైల్94406-10201&83091-70485savithahpe1@gmail.com


23.శ్రీ వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మొబైల్ 95344-44999subashforrcp@gmail.com


24. శ్రీ కొండపల్లి శ్రీనివాస్ మొబైల్ : 91771-12349 skondapalli9@gmail.com


25. శ్రీ ఎం.రామ్ ప్రసాద్ రెడ్డి రవాణా శాఖ మొబైల్ : 63610-27470 prasadreddy3@gmail.com


SGT.

DEVIREDDY PULLARAO
SGT.
M P P SCHOOL
కవురు వారి వీథి
రాయకుదురు
వీరవాసరం మండలం
UTF VEERAVASARAM

utfveeravasaram

transfers2025 main points

BREACKING NEWS
*
టెట్ షెడ్యూల్:
టెట్ నోటిఫికేషన్ విడుదల : 24.10.2025

పరీక్ష ఫీజు చెల్లింపు: 24.10.2025 నుంచి 23.11.2025 వరకు(

ఆన్లైన్ దరఖాస్తులు: 24.10.2025 నుంచి 23.11.2025 వరకు/span>
ఆన్లైన్ మాక్స్టెస్ట్: అందుబాటులోకి 25.11.2025 నుంచి1

హాల్ టికెట్ల డౌన్లోడ్: 03.12.2025 నుంచి

పరీక్షలు: 10.12.2025 నుంచి వరకు (రెండు సెషన్లలో)

ప్రొవిజినల్ కీ : 02.01.2026

పీహెచ్సీ వారికీ కూడా ప్రిఫెరెన్సు పాయింట్లు.

ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ: 02.01.2026 నుంచి 09.01.2026

తుది కీ విడుదల: 13.01.202

ఫలితాలు విడుదల: 19.01.2026


(OC-EWS 60% and above 90 Marks and above

BC 50% and above 75 Marks and above
SC/ ST/ PwBD & Ex-servicemen 40% and above 60 Marks and above
*S
The fee towards submission of application online and for the conduct of Computer Based Examination is Rs.1000/- for each Paper-1A, Paper-1B, Paper-2A and Paper-2B separately.
TET for in-service Teachers:having more than five years service to retire on superannuation, must qualify the TET.
UTF VEERAVASARAM

utfveeravasaram

utf

_⛳యు.టి.ఎఫ్ .⛳* *🙏 అమరజీవులు చెన్నుపాటి, ఆప్పారి, మైనేని, పోలిశెట్టి, రామిరెడ్డి మీ అడుగు జాడల్లోనే - యూటిఎఫ్ జెండా నీడ లోనే 🙏* 👉యూటిఎఫ్ అంటే ఒక ధైర్యం 👉యూటిఎఫ్ అంటే ఒక భరోసా 👉యూటిఎఫ్ అంటే ఒక నమ్మకం 👉యూటిఎఫ్ అంటే ఒక అధ్యయనం. 👉యూటిఎఫ్ అంటే ఒక అధ్యాపనం. 👉యూటిఎఫ్ అంటే ఒక సామాజిక సృహ 👉యూటిఎఫ్ అంటే ఒక నిజాయితీ 👉యూటిఎఫ్ అంటే ఒక ఉద్యమం. 👉యూటిఎఫ్ అంటే ఒక త్యాగం. 👉యూటిఎఫ్ అంటే ఉపాధ్యాయుల గుండె చప్పుడు. 👉యూటిఎఫ్ అంటే అవినీతి పరుల గుండెల్లో గుబులు. 👉యూటిఎఫ్ అంటే ప్రభుత్వాల్లో ఎవరున్నా ఉపాధ్యాయుల చెంతన ఉండేది. 👉యూటిఎఫ్ అంటే సమస్య గుర్తించడం లో ముందుండేది. 👉యూటిఎఫ్ అంటే సమస్య పై స్పందించడంలో ముందుండేది. 👉 ఉమ్మడి ఉద్యమాల నిర్మాణం లో , ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో , సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేయడంలో యూటిఎఫ్ కు సాటి లేరు మరెవ్వరూ... 👉మన, నా యు.టి.ఎఫ్ సంఘాన్ని నిర్భయంగా, నాగుండెల్లొ, గుండెలపై గర్వంగా నిలుపు కుంటా, యూ.టి.ఎఫ్ జెండాక్రింద గర్వంగా పోరుబాటలో పయనిస్తా...జిందాబాద్ ,జిందాబాద్ యు.టి.ఎఫ్ జిందాబాద్....

స్పూర్తిదాయకమైన కథలు

ప్రముఖుల సూక్తుల పుస్తకం  

1. జాతి సాల్యూట్ చేయదగిన  వ్యక్తిత్వాలు



అబ్దుల్ కలాం రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఓసారి కూనూరు (ఊటీ) వెళ్లాడు... అక్కడికి వెళ్లాక తెలిసింది, ఫీల్డ్ మార్షల్ శాం మానిక్ షా అక్కడే ఓ మిలిటరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడని..! 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో తను మన ఆర్మీ చీఫ్... తనను పరామర్శించాలని అప్పటికప్పుడు నిర్ణయించుకుని నేరుగా వెళ్లాడు... మానిక్ షా బెడ్ పక్కనే చాలాసేపు కూర్చుని ఆరోగ్యస్థితిని కనుక్కున్నాడు.., వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించాడు...

తిరిగి వెళ్లిపోయే సమయంలో... ‘‘ఇక్కడంతా సౌకర్యంగానే ఉందా..? నేను చేయదగిన సాయం ఏమైనా ఉందా..? అడుగు మిత్రమా..?’’ అన్నాడు కలాం...


‘‘ఓ అసంతృప్తి ఉంది సార్...’’  అన్నాడు మానిక్ షా...

‘‘ఏమిటది..?’’ కలాం మొహంలో ఆశ్చర్యం...

‘‘నా దేశ ప్రథమ పౌరుడే నా దగ్గరకు వచ్చినప్పుడు నేను లేచి తనకు శెల్యూట్ చేయలేని స్థితిలో ఉన్నందుకు అసంతృప్తి సార్...’’ అన్నాడు కళ్లు తుడుచుకుంటూ...

కలాం కళ్లల్లో కూడా తడి... షా చేయి మీద చేయి వేసి ఆత్మీయంగా నొక్కాడు...

‘‘సార్, చిన్న రిక్వెస్టు... ఇరవై ఏళ్లుగా నాకు ఫీల్డ్ మార్షల్ ర్యాంకుకు దగిన పెన్షన్ రావడం లేదు...’’ చెప్పాడు షా...

కలాం ఢిల్లీ వెళ్లగానే చేసిన మొదటిపని... షా పెన్షన్ ఫైల్ తెప్పించుకోవడం..! తగిన ఆదేశాలు జారీచేయడం...! వారం రోజుల్లో డిఫెన్స్ సెక్రెటరీ ద్వారా 1.25 కోట్ల బకాయిలకు సరిపడా చెక్కును ప్రత్యేక కొరియర్ ద్వారా ఊటీకి పంపించారు...

దటీజ్ కలాం... ఇక్కడే చిన్న ట్విస్టు... ఆ డబ్బు మొత్తాన్ని మానిక్ షా ఆర్మీ రిలీఫ్ ఫండ్‌కు డొనేట్ చేశాడు... దటీజ్ షా... వావ్... ఎవరు ఎవరికి శెల్యూట్ చేయాలి..? ఒకరు తక్కువ కాదు, ఒకరు ఎక్కువ కాదు... జాతి శెల్యూట్ చేయదగిన కేరక్టర్లు..

దేశానికి, దేశ ప్రజలకు సేవ చేయడమంటె బందిపోట్లులాగా  దోచుక తినటం కాదు...
రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించి, వాటిని పాటించి, కాపాడటం..‌.

రేపటి మన దేశపౌరులు వీరినుండి, ఇలాంటి వారి నుండి నేర్చుకొవాలి.

🙏🙏🙏🙏🙏🙏🙏

                                   2.   నా సర్టిఫికెట్ కధ - గంధం చంద్రుడు IAS


 

1992 వ సంవత్సరం…..
కొలిమిగుండ్ల గ్రామం....
మండల రెవెన్యూ అధికారి కార్యాలయం (MRO Office) ....
మధ్యాహ్న సమయం…

ఓ పది మీటర్ల దూరంలో..MRO Office ఎదురుగా ఓ ఫారం చెట్టు ....prosopis juliflora ( కంప చెట్టు. దీన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు)
దాని కింద వున్న చిన్న అరుగులాంటి బండమీద కూర్చుని ఉన్నాడు, ఓ పదకొండు సంవత్సరాల అబ్బాయి.
ఆ కంపచెట్టు తెరిపెలు తెరిపెలుగా వుంది.  ఎక్కువ నీడను కూడా ఇవ్వలేకపోతుంది.
అది తప్ప ఇంక అక్కడ నీడ వున్న ప్రదేశం ఏదీ లేదు. దాని క్రిందనే తలదాచుకోవాలి, లేదంటే ఎండలో మాడాలి. వేరే మార్గం లేదు.
ఆ అబ్బాయి ఆ చెట్టు కింద వున్న  గజం రాయి మీద కూర్చొని MRO Office వైపు చూస్తూ వున్నాడు.
 
ఏమైనా పిలుపు వస్తుందేమోనని.
---------------------------------
దాదాపు పదకొండున్నర – పన్నెండు ప్రాంతంలో వచ్చాడు అక్కడికి.
అక్కడ కార్యాలయంలో వున్న అధికారిని అడిగితే “వేచి వుండు, MRO (Mandal Revenue Officer) గారు వచ్చిన తర్వాత నీ పని చూస్తారు” అని చెప్పాడు.

ఆ MRO రాక కోసం...
ఆ కార్యాలయ అధికారి పిలుపు కోసం ...

చూస్తూ అక్కడే పడిగాపులు కాస్తూ కూర్చున్నాడు ఆ అబ్బాయి.
ఇంకో పెద్దాయన వచ్చి ఆ బండ మీద కూర్చుంటూ ఆ అబ్బాయిని అడిగాడు,
“ఏం నాయనా! ఇక్కడ కూర్చున్నావు? ఏం పని కోసం వచ్చావు?”
“Caste Certificate కోసం వచ్చాను పెద్దాయన”
 
“దాదాపుగా నెల రోజుల పైనే అయింది అప్లికేషన్ పెట్టి, ఈరోజు ఇస్తామన్నారు, అందుకే వచ్చాను.”
“ఎవరు చెప్పారు?”
“మా ఊరి తలారి (Village Revenue Assistant) చెప్పాడు.”
“ఒక్కడివే కనపడుతున్నావ్? పెద్దలెవరూ రాలేదా , నీతో పాటు?”
“లేదు, పెద్దాయన. మా అమ్మానాన్న పనికి వెళ్లారు. నన్ను వెళ్లి Certificate తెచ్చుకోమన్నారు”
“ఏం చదువుతున్నావ్?”
“ఐదవ తరగతి చదువుతున్నాను.  అది అయిపోవచ్చింది.  నవోదయ స్కూల్కు పరీక్ష వ్రాశాను.  Select అయ్యాను.  అన్ని Certificates తీసుకుని రమ్మని letter వచ్చింది.”
Caste Certificate MRO Office లో ఇస్తారు కదా! దాని కోసం చాలా రోజులయ్యింది apply చేసుకొని.  ఇప్పుడు ఇస్తారు వెళ్లి తీసుకోమని మావూరి తలారి చెప్పాడు, అందుకే వచ్చాను.
------------------------
“నాన్న, నాకు Caste Certificate మరియు ఇతర Certificates అన్నీ originals తీసుకొని రమ్మన్నారు, నవోదయ స్కూలుకు.”
ఆరో తరగతి లో join అవ్వాలంటే అన్ని certificates తీసుకొని వెళ్లాలంట!”
“సరే మరి, నేనైతే రాలేను, నేను పనికి వెళ్ళాలి. ఇంతకు ముందు photo తీసుకోవడానికి వెళ్ళా వ్ కదా! వారు వెళ్లినప్పుడు వెళ్లు మరి.”
“వాళ్లు select కాలేదంట, వాళ్ళు ఇప్పుడు Certificate తీసుకోవడానికి రారు.”
“సరే మొన్ననే కదా! నువ్వు వాళ్లతో కలిసి కొలిమిగుండ్ల వెళ్లి వచ్చావు, బస్సుల రూటు తెలుసుకదా! ఒక్కడివి వెళ్లిరాలేవా”
“నువ్వు రాలేకపోతే నేను వెళ్లి వస్తాను. నాకు చార్జీకి డబ్బులివ్వు మరి.”
“ఎంత?”
“పేరుసోముల నుండి తిమ్మనాయుని పేటకు రూపాయిన్నర అక్కడి నుండి కొలిమిగుండ్ల కు రెండు రూపాయిలు... మొత్తం మూడున్నర.
మూడున్నర రాను, మూడున్నర పోను మొత్తం ఏడు రూపాయలు అవుతుంది.”
“సరే, ఇదిగో! ఈ పది రూపాయలు తీసుకో!”
మధ్యాహ్నం పూట అక్కడే కొలిమిగుండ్లలో ఏదో ఒకటి కొనుక్కుని తిను.”
అంటూ తీసి పది రూపాయలు చేతిలో పెట్టారు.
“డబ్బులు జాగ్రత్త. అజాగ్రత్తగా వుండి డబ్బులు పోగొట్టుకున్నావంటే అంతే సంగతులు”
పది రూపాయలు తీసుకొని జాగ్రత్తగ, పొద్దున్నే వేసుకోవాల్సిన నిక్కర్ జేబులో పెట్టుకొని పడుకున్నాను
మరుసటి రోజు పొద్దున్నే లేచి, తయారయ్యి భోంచేసి ఎనిమిది కల్లా బయలు దేరాను.
అంగీ (Shirt) నిక్కరు(half pant) వేసుకొని పది రూపాయల నోటును జాగ్రత్తగా పెట్టుకొని, పేరుసోముల దగ్గర వున్న బస్సు ఆగే స్ధలంలో వచ్చి నిలబడ్డాను.
పేరుసోముల నుండి తిమ్మనాయుని పేట, అక్కడి నుండి కొలిమిగుండ్ల వచ్చేసరికి జేబులో ఒక అయిదు రూపాయల నోటు, ఒకటిన్నరూపాయల చిల్లర మిగిలింది.  కండక్టర్ ఇచ్చిన డబ్బులు అంగీ జేబులో పెట్టుకొని, బస్సు దిగి సరాసరి MRO Office కి వెళ్లి అక్కడ వున్న Junior Assistant ను కలిసి వచ్చిన పని చెప్పగానే
MRO గారు బయటికి వెళ్లారు.  వచ్చిన తరువాత కలువు అని చెప్పడంతొ, నేను ఫారం (ముళ్లకంప) చెట్టు కింద కూర్చుని wait చేస్తూ వున్నాను.
అక్కడికి ఓ మాదిరిగా జనాలు వస్తూ పోతూ వున్నారు.  MRO Office ఎదురుగా ఒకాయన తెల్ల బట్టలు వేసుకొని
కుర్చీ మీద కూర్చొని వచ్చిపోయే వారితో మాట్లాడుతూ వున్నాడు.   కాలి మీద కాలు వేసుకుని దర్జాగా కూర్చున్నాడు కుర్చీలో.   వచ్చిన వారు చేతులు కట్టుకుని నిలబడి మాట్లాడుతూ వున్నారు
“ఏం కావాలి నీకు?”
“Certificate కోసం వచ్చాను.”
“ఆ గదిలో clerk (Junior Assistant) వుంటాడు. ఆయన్నివెళ్లి అడుగు.”
ఆయన చూపించిన వైపున వున్న రూమ్ దగ్గరికి వెళ్లి  అక్కడ వున్న వారిలో ఒకరితో అడిగాను – “సర్, నాకు Caste Certificate కావాలి apply చేసి చాల రోజులయింది.  ఈ రోజు వస్తే ఇస్తామని చెప్పారు.
“ఏం పేరు?”
“గంధం చంద్రుడు”
“ఏ ఊరు”
“కోటపాడు”
“సరే, wait చెయ్యి MRO గారు సంతకం చేయ్యాల్సి వుంది.  సార్ వచ్చి సంతకం చేసిన తరువాత ఇస్తాం
“అలాగే సర్.”
-----------------
MRO గారు ఎప్పుడు వస్తారో తెలియదు.  ఎప్పుడు వెళతారో తెలియదు.  ఒక వేళ నేను తినడానికి బయటికి వెళ్తే, ఆయన వచ్చి వెళ్లిపోతే?
లేదు లేదు, నేనెక్కడికి వెళ్లకూడదు. Certificate తీసుకొని కావాలంటే అప్పుడు తింటాను ఏమైనా...

పన్నెండు…
ఒకటి…
రెండు…
మూడు…
నాలుగు గంటలు గడిచిపోయాయి.
ఆ ముల్లకంప చెట్టు కింద, అటూ ఇటూ తిరుగుతూ వచ్చిపోయేవారిని గమనిస్తూ.... వున్నాను. చెట్టు కింద వున్న బండ కాలుతూ వుంది, ఎండకు కాళ్లు కాలుతూ వున్నాయి, చెప్పులు లేక.
 
అటూ ఇటూ తిరుగుతూ ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ వున్నాను.

దాదాపు మూడున్నర ప్రాంతంలో వచ్చారు MRO గారు.  సరాసరి ఆయన room లోకి వెళ్లిపోయారు.
అప్పటు వరకు అక్కడ దర్జాగా తెల్ల బట్టలు వేసుకొని, కూర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న వ్యక్తి*, MRO గారు రాగానే ఒక్క ఉదుటున లేచి, కుర్చీని పక్కకు జరిపి, వంగి ఆయన నమస్కారం పెట్టి, ఎక్కడలేని వినయం ప్రదర్శించాడు.
నాకు అది చూసి ఆశ్చర్యం అనిపించింది.  మళ్లీ clerk వున్న రూమ్ లోకి వెళ్లి ఆయనకు గుర్తు చేశాను.  MRO గారు వచ్చారు అని.  సరే, నేను తీసుకొని వెళ్తాను files అన్ని, నువ్వు wait చెయ్యి అన్నట్లు చూపించాడు నాకు.  మళ్లీ పదినిమిషాలు అటూ ఇటూ తిరిగి మళ్లీ దగ్గరికి ‌వెళ్లాను.  ఈ సారి బిళ్ల బంట్రోతు అడిగాడు.
 
 
“నీ పని కూడా అయిపోయిందిలే! ఏమన్నా తెచ్చావా?” నన్ను చూస్తూ అన్నాడు బిళ్ల బంట్రోతు.
నాకు అర్ధం కాలేదు
 
“ఏమన్నా తెచ్చావా? అంటే చాలా చూస్తావేం?”
“డబ్బులున్నాయా?”
లేవని కానీ,  వున్నాయనీ కానీ చెప్పకుండా అలా వుండిపోయాను నేను.
నేను ఏమీ చెప్పక   పోయేసరికి, ఆయన నా file ను పక్కన పెట్టి మిగతా Certificate/Files  మీద ఎక్కడయితే MRO గారు సంతకం చేశారో, దాని కింద అధికారిక stamp వేస్తూ, వచ్చిన వారికి వచ్చినట్టు certificates ఇస్తూవున్నాడు.   వారు ఆయనకు ఏదో ఇస్తున్నారు. చేతిలో చెయ్యి కలుపుతూ
ఒక్కొక్కరి నుండి ఒక్కో పద్ధతి…
ఒకరికేమో గోడ చాటుకు వెళ్ళి ఏదో చేతిలో చెయ్యి పెట్టి తీసుకొని, వెంటనే certificate తెచ్చి ఇస్తున్నాడు.  ఇంకొకరితో అలా పది అడుగుల దూరం నడిచి, మళ్లీ లోపలికి వెళ్లి వాళ్ల certificate/Documents వాళ్లకి ఇస్తున్నాడు.
మద్యమద్యలో నా వైపు చూస్తూ వున్నాడు.
ఇదంతా నాకు అర్ధం కావడం లేదు.  అందరికీ Certificate/documents ఇస్తూవున్నాడు.  నాకు మాత్రం ఇవ్వట్లేదు.
ఒకవైపు ఎండ...
ఒకవైపు ఆకలి...
బంట్రోతేమో certficate ఇవ్వడం లేదు.
వుండబట్టలేక మళ్లీ అడిగాను, “ నా certificate ఇవ్వండి.”
“సరే, ఇటు రా”
దగ్గరికి వెళ్లాను.
నా చొక్కా జేబులో చెయ్యి పెట్టాడు. అందులో అయిదు రూపాయిల నోటు చిల్లర ఆయన చేతికి చిక్కాయి.
నేను వెనక్కి జరగబోయాను, చేతిని అడ్డు పెట్టబోయాను.
కానీ రెండూ జరగలేదు.  అంత వేగంగా జేబులో చెయ్యి పెట్టడం, డబ్బులు తీసుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి.
లోపలికి వెళ్లి certificate బయటికి తెచ్చి, అక్కడ వున్న stool మీద దాన్ని వుంచి నా ఎదురుగానే దాని మీద MRO గారి designation stamp, office stamp (Round stamp) వేసి…
“ఇదిగో నీ certificate తీసుకో.”
నాకు certificate ఇచ్చినందుకు సంతోషం కంటే, జేబులో నుండి ఉన్న డబ్బు మొత్తం లాక్కునందుకు ఎక్కువ బాధ కలిగింది. కొద్ది సేపు ఆగాను, ఆయన ఏమన్నా కనికరించి నా డబ్బులు నాకు తిరిగి ఇస్తాడేమోనని.  ఆయనకు అటువుంటి ధ్యాసే లేదు.  ఆయన మిగతా certificates కు stamp వెయ్యడం, వాటికోసం వారితో పక్కకు వెళ్లడం, వారితో చెయ్యి కలపడంలో busy గా ఉన్నాడు.
అప్పటికి దాదాపు అయిదున్నర కావస్తుంది టైం.
ఏం చెయ్యాలో కొద్ది సేపు పాలుపోలేదు నాకు.  కొద్ది సేపటికి మా అత్తగారి ఊరు -  బెలుం - గుర్తుకువచ్చింది.  అది కొలిమిగుండ్ల నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
------------------------x------------------------------x-----------------------------------------------
చిన్న సుబ్బమ్మ- మా మేనత్త, బెలుం లో ఉంటారు.  ఆవిడంటే నాకు చాలా ఇష్టం.  తను కూడా చిన్న అల్లుడినైన నన్ను చాలా మురిపెంగా చూసుకుంటుంది.  బెలుం కు బస్సులో వెళ్లాలన్నా రూపాయిన్నర కావాలి.  అది కూడా లేకుండా తీసుకున్నాడు ఆ బిళ్ల బంట్రోతు.  ఇంక ఎక్కువసేపు ఆలోచించలేదు.  వేగంగా నడుచుకుంటూ వెళ్తే ఒక గంట - గంటన్నర లో బెలుం చేరుకోవచ్చు.
 
అనుకున్నదే తడవుగా, కాళ్లకి పని చెప్పాను.  కడుపు ఆకలితో నక నక లాడుతూవుంది.  ఎండకు దుమ్ము, ధూళి కొట్టుకు పోయి ఉన్నాను.  Certificate ను జాగ్రత్తగా ఒక పేపర్ లో చుట్టి రౌండుగా చేసి జేబులో పెట్టుకున్నాను.
కొలిమిగుండ్ల నుండి బెలుంకు సింగల్ రోడ్డు.  ఎప్పుడూ పాడయిపోయి గతుకులు గతుకులుగా ఉంటుంది.  ఆ దారిలో నాపరాళ్ల గనులు చాలా వున్నాయి.  అందులో పని చేసేవారు మూడు నాలుగు లోపు పనులు ముగించి ఇళ్లకు వెళ్తారు.  ఐదు వరకు ఎవ్వరూ ఉండరు.  అంతా నిర్మానుష్యంగా ఉంటుంది.
రోడ్డు మీద ఒక్కడినే నడవడం మొదలు పెట్టాను, భయపడుకుంటూనే.  చిన్న అడుగులు ఎంతగా వెయ్యాలనుకున్న ఎక్కువ దూరం పడవు.  వేగంగా వెళ్లడం ఒక్కటే మార్గం. ఇక లాభం లేదనుకుని పరిగెత్తడం మొదలు పెట్టాను . ఆయాసం వచ్చేంత వరకు పరిగెత్తడం, ఆయాసం తగ్గేంత వరకు నడివడం తర్వాత మళ్లీ పరిగెత్తడం - మళ్లీ నడవడం
- పరుగు
- నడక -
ఇలా సాగింది నా  ప్రయాణం.  కొద్ది కొద్దిగా సూర్యకాంతి తగ్గుతూ ఉంది.  ఆ పెద్ద కొండల వలన సూర్యుడు పూర్తిగా కనిపించకుండా అయిపోయాడు.  దాదాపు చీకటిపడిపోయింది.
భయం భయంగా, వేగంగా వెళ్లాలన్న ఆతృతతో రొప్పూతూ certificate ను, గుండెను అరచేతిలో పెట్టుకుని వెళ్లాను.  దాదాపు పూర్తిగా చీకటిపడుతున్న సమయానికి ఆరున్నర ప్రాంతంలో బెలుం లో ఉన్న మా అత్తగారింటికి చేరిపోయాను. బయట నవారు మంచం మీద మా మామ కూర్చుని వున్నాడు.  ఆయన ఎవరితోనో మాట్లాడుతున్నాడు.  నన్ను గమనించలేదు. నాకు ఆగి ఆయన్ని పలకరించే పరిస్ధితి లేదు. సరాసరి ఇంటిలోపలికి ‌వెళ్లాను.
ఇంటి లోపలికి అడుగు పెట్టేటప్పుడు గమనించింది మా అత్త.
“ఏం నాయనా! బాగున్నావా?”
“ఈ టైములో వచ్చారేమి?” పెద్ద వాళ్లతో కలిసి వచ్చాననుకుని ఇంకా బయటకి చూస్తూ వుంది.
మిగతా వారు ఎక్కడా అన్నట్టు.  ఎవరూ వెనక లేకపోయెసరికి అప్పుడు అడిగింది -
“ఒక్కడివే వచ్చావా?”
“అవును, ఒక్కడినే వచ్చాను”
కాళ్లంతా దుమ్ము పట్టిపోయి వున్నాయి.  మాటలు రావడం లేదు.  నోరు ఎండిపోయి ఉంది.  నీళ్లు ఇవ్వమన్నట్టు సైగ చేసాను.  సూరి - మా అత్త కొడుకు - నాకంటే నెల రోజులు చిన్నవాడు - వెంటనే నీళ్లు తెచ్చి ఇచ్చాడు.  గబగబా నీళ్లు తాగి మంచం మీద కూర్చున్నాను, కాళ్లు నొప్పి పెడుతుంటే.

“తిన్నావా?”

“లేదు”
“ఎలా వచ్చావు?”
“కొలిమిగుండ్ల నుంచి నడుచుకుంటూ...”

అప్పుడు అర్ధం అయ్యింది మా అత్తకు  ఏదో పొరపాటు జరిగింది అని.  వచ్చి పక్కన కూర్చింది.  తల మీద చెయ్యి వేసి నిమురుతూ అడిగింది - ఏం జరిగిందని - మొత్తం జరిగిందంతా చెప్పాను.  కళ్లలో నీళ్లు తిరుగుతుండగా.
గట్టిగా హత్తుకుని మంచం మీద నుంచి లేచి వంట గదిలోకి వెళ్లి పళ్లెం లో అన్నం, పప్పు పెట్టుకుని వచ్చి - తినమని ఇచ్చింది.  నా పక్కనే పడుకుని రాత్రి కాళ్లు పిసుకుతూ పడుకుంది.  వాళ్లను శాపనార్ధాలు పెడుతూ.
పొద్దునే లేచి అత్త తో డబ్బులిప్పించుకుని కోటపాడుకు బయలుదేరాను.
------
వచ్చిన తర్వాత ముందు రోజు రాత్రి మా ఇంట్లో జరిగిన విషయం తెలిసింది.
“చిన్నోడు వచ్చాడా?” పనిముగించుకుని తిరిగి వచ్చి, కాళ్లు కడుక్కుంటూ అడిగాడు నాన్న, అమ్మని.  అప్పటికి దాదాపు ఏడు గంటలు అవుతుంది.  ఇంకా రాలేదా? సరే నేను bus stop దగ్గరికి వెళ్లి తీసుకుని వస్తాను అని, అమ్మ - భోజనం తిని వెళ్లు అని అంటూ వున్నా వినకుండా గబగబా వెళ్లిపోయాడు.
పొద్దున్నుంచి సాయంత్రం వరకు పని చేసి బాగా అలసి పోయి ఉన్నాడు.  కాళ్లు, చేతులు కడుక్కుని, భుజం మీద towel వేసుకుని bus stop కి వెళ్లాడు.
పేరుసోములలో తిమ్మనాయుని పేట నుండి కోవెలకుంట్ల వళ్లే బస్సులో రావాలి అబ్బాయి.  చివరి బస్సు దాదాపు రాత్రి ఏడున్నర - ఎనిమిది మద్య వస్తుంది.  దారిలో వేరేవాళ్లు ఎదురైతే వాళ్లను అడిగాడు - మా చిన్నబ్బాయిని ఏమన్నా చూసారా అని.
చివరి బస్సు ఎనిమిది గంటలకు వచ్చింది.  అందులో కోటపాడు వాళ్లు ఒకరిద్దరు దిగారు - నేను కనపడలేదు.  దిగిన వారిని ఆత్రంగా అడిగాడు - మా చిన్నబ్బాయిని ఎక్కడైనా చూసారా? అని.  అందరి నుండి లేదు/చూడలేదు అన్న సమాధానమే వచ్చింది.
bus stop లో దాదాపు ఒక గంట సేపు - అంటే తొమ్మిది వరకు వేచిచూసి, ఏం చెయ్యాలో దిక్కుతోచలేదు ఆయనకు, నాన్నకు భయం పట్టుకుంది. ఏమన్నా అయ్యిందా అబ్బాయికి. లేదా పని జరగక అక్కడే ఆగిపోయాడా? ఎవరైనా ఏమైనా చేశారా? ఏం చెయ్యాలో పాలుపోక బాధపడుకుంటూ తిరిగి ఇంటికి వచ్చాడు.
ఆ కాలంలో ఫోన్ లు లేవు - atleast మా గ్రామంలో ఎవరికీ landline కూడా లేదు.  
ఏమైపోయాడు, ఎలావున్నాడు తెలుసుకునే మార్గమే లేదు.  పోనీ కొలిమిగుండ్ల కి వెళ్దామంటే బస్సులు లేవు ఆ టైములో... ఇతర వాహనాలు అద్దెకు తీసుకొని వెళ్లడానికి కూడా దొరకవు.  దొరికినా వాటిని అద్దెకు తీసుకునేంత స్థోమత లేదు.
ఇంటికి వచ్చీ రాగానే అమ్మ భయంగానే అడిగింది - ఎక్కడ పిల్లోడు అని.  రాలేదు అని చెప్పగానే ఒకటే ఏడుపు.
నాన్న లోలోపల ఏడుస్తున్నాడు.  అమ్మ బయటకి ఏడుస్తూ ఉంది గట్టిగా. వండిన భోజనం అలానే ఉంది.  నాన్న బస్టాండుకు వెళ్లాడు కదా - పిల్లోడిని తీసుకు వస్తాడు కదా - అప్పుడు అందరం కలిసి తిందాం అని అమ్మ కూడా తినలేదు. నాన్న ఒక్కడే తిరిగి వచ్చేసరికి ఇద్దరికీ తినాలనిపంచలేదు.
రాత్రంతా ఒకటే ఏడుపులు.... మధ్యమధ్యలో నాన్న ధైర్యం చెప్తున్నాడు అమ్మకు – “ఆ! ఏమి అయ్యింటాది.  పని అయ్యిండదు.  అక్కడే ఉంటాడు.  పొద్దున్నేవచ్చేస్తాడులే.”
అన్ని దేవతలను వేడుకుంది అమ్మ మనసులో - వాళ్లతో వీళ్లతో మాట్లాడాడు నాన్న - ఏం చేద్దాం ఇప్పుడు అని.  ఉదయం ఒకటి రెండు బస్సులు వచ్చేవరకు వేచి చూడడం తప్ప మార్గము లేదని చెప్పారు వాళ్ళు.
గుండెను అరచేతిలో పట్టుకుని రాత్రంతా ఏడుస్తూ, మేలుకుని ఉన్నారు.  అమ్మ, నాన్న - ఇద్దరూ మరుసటి రోజు మధ్యాహ్నం నేను వచ్చిన తర్వాత కానీ భోజనం చెయ్యలేదు.
అలా ముగిసింది నా certificate కథ. 

3.చరిత్ర చెప్పని వీరుడు జశ్వంత్ సింగ్ 


చైనా1959లో అకస్మాత్తుగా టిబెట్ ను ఆక్రమించడంతో అక్కడి బౌద్ధగురువు ఇండియాకు శరణార్ధిగా వచ్చారు. ఆయనకు ఆశ్రయం ఇవ్వడంతో భారత్ పై శతృత్వం పెంచుకుంది చైనా.......


1962లో చైనా భారత్ భూభాగాలపై దాడిచేయడం ప్రారంభించినది. భారత్ దగ్గర సరైన ఆయుధసామగ్రిలేదు. నాసిరకం ఆయుధాలతో ,సరైన వ్యూహలు కరువైనందున చైనా సైనికులను భారతీయసైనికులు ఎదురుకోలేరని తవాంగ్ ప్రాంతం నుండి సైనికులను వెనుకకు తిరిగిరావలసిందిగా  నెహ్రు గారూ,రక్షణశాఖామంత్రి కృష్ణమీనన్ గారు ఆజ్ఞాపించారు............

అయితే నూర్ నాంగ్ (అరుణాచల్ ప్రదేశ్ )దగ్గర కాపలాకాస్తున్న గర్వాల్ రైపిల్ ఆర్మీ డివిజన్  లోని ముగ్గురు యువకులు శత్రువులకు వెన్నుచూపడం ఇష్టంలేక అక్కడే ఎత్తైనకనుములో దాక్కుకొని శత్రువులపై ఏదురుదాడికి దిగారు. కేవలం ముగ్గురు మూడువందలపైగా వున్న చైనాసైనికులను నిలువరించసాగారు..........

1962 ,నవంబర్ -15 ..నూర్నాంగ్ ఫోష్టుపై చైనా జవాన్స్ కాల్పులు ప్రారంభించారు. మన ముగ్గురు జవాన్స్ ధైర్యంగా ఎదురుకున్నారు.అందులో 21 సంవత్సరాల యువకుడు చాలా చురుకుగా కదులుతున్నాడు.............. అతని గురితప్పడంలేదు.ప్రత్యర్థులలో చాలామందికి రైపిల్ తూటాలు దిగాయి.ఒక అరగంట తరువాత వారి నుండి కాల్పులు ఆగిపోయాయి. అంతే ఇద్దరు యువజవాన్స్ మెరుపువేగంగా వారివైపు కదిలారు..భారతజవాన్ తూటాలకు బలైపోయిన చైనా జవాన్స్ దగ్గరనుండి ఆయుధాలను తీసుకొని మళ్ళీ తిరిగివచ్చేసారు. మళ్ళీ కొన్ని గంటల తరువాత మళ్ళీ చైనాజవాన్స్ నుండి కాల్పులు ప్రారంభమయినాయి.......... మళ్ళీ మనజవాన్ ఎదురుకాల్పులకు దిగారు. మళ్ళీ కొంతసేపటి తరువాత కాల్పులు ఆగిపోయాయి. మళ్ళీ మన జవాన్స్ వారివద్దకు కదిలారు..ఆయుధాలను తస్కరించి మళ్ళీ తిరిగి వస్తున్న మన జవాన్స్ ను గమనించి శత్రుసైనికులు కాల్పులు జరపడంతో ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.తన కళ్ళముందే తన సహచరులు నేలకూలడం చూస్తూ నిస్సహాయంగా చూస్తుండిపోయాడు 21యేండ్ల గర్వార్ రైఫిల్ మాన్ .
1962 నవంబరు 16 ..నూరనాంగ్ కనుమ .భారతజవాన్ ఒక్కడే యుద్దానికి సిద్దమవుతున్నాడు. తన దగ్గర వున్న ఆయుధాలను కొన్ని అడుగులకు ఒకటి చొప్పున అమర్చుకుంటున్నాడు. అతని పోరాటం గమనిస్తున్న సెరా,నూరా అనే గిరిజన యువతులు అతనికి సహాయంగా వచ్చారు. వారికి రైఫిల్స్ ఎలా మందుగుండ్లు పెట్టాలో నేర్పించాడాయువకుడు. మళ్ళీ చైనా కాల్పులు ప్రారంభించినది. అంతే యువ జవాన్ మెరుపువేగంతో కదిలాడు. ఒక్కొక్క రైఫిల్ దగ్గరకు వెళ్ళడం కాల్పులు జరగడం,మళ్ళీ మరొక ఫోష్టుదగ్గరకు పరిగెత్తడం కాల్పులు జరపడం..మెరుపువేగంగా కదులుతూ అతను నలువైపుల నుండి జరిపే కాల్పులకు తికమకపడిపోయిన చైనాజవాన్స్ ,భారతసైనికులు చాలామంది వున్నట్లు భావించి మళ్ళీ వెనుదిరిగారు.
భారతసైనికుల వ్యూహం అర్థంకాలేదువారికి. అప్పటికే వందకు పైగా తమ సహచరులు మరణించారు. నూరనాంగ్ కనుమలో భారీగా భారతసైనికులున్నట్లు పైఅధికారులకు సందేశం పంపారు...............

1962 నవంబరు-17. మళ్ళీ చైనా జవాన్స్ పై అటాక్ మొదలుపెట్టాడా 21 యేండ్ల యువజవాన్ .సెరా,నూరా సహాయంతో శత్రుశిబిరంలోని జవాన్స్ ను ఒక్కొక్కరిగా నేలకూలుస్తున్నాడావీరుడు. అతని ధాటికి మళ్ళీ వెనుదిరిగారు చైనా జవాన్స్ .చాలామంది ప్రాణాలొదిలారప్పటికే.............

ఇంతలో ఎవరో అపరిచితుడు ఏదో తీసుకొని కొండపైకి వెళుతుండటం చైనా జవాన్స్   చైనా గమనించారు. వెంటనే అతనిని చుట్టుముట్టి అదుపులో తీసుకొని చిత్రహింసలు పెట్టగా,తాను కొండపైన వున్న జవాన్ కు భోజనం తీసుకెళుతున్నట్లు చెప్పేసాడావ్యక్తి. అది విని హతాసులైపోయారు వాళ్ళు.........

కేవలం ఒక్కడు,ఒకే ఒక్కడు మూడురోజులనుండి వారిని ఎదురుకోవడం,వందమందిపైగా తమ జవానులప్రాణాలు తీయడం భరించలేకపోయారు.కోపంతో ఊగిపోతూ భారత జవాన్ ను చుట్టు ముట్టారు. అయినా జంకలేదా యువజవాన్ .చివరిదాకా పోరాడాడు.సాయంత్రం సూర్యడస్తమిస్తుండగా శత్రువుల తూటా గొంతులో దిగగా.......... జైహింద్ అంటూ ప్రాణాలొదిలేసాడాయువకుడు. సెరా శత్రువులనుండి తప్పించుకొనేందుకు కొండపై నుండి లోయలోకి దూకి ఆత్మహత్యచేసుకుంది.నూరా ను చిత్రహింసలు చేసి చంపారు చైనీయులు. మన జవాన్ గొంతుగోసి తలను తీసుకెళ్ళారు...........

ఇంతకీ ఆ 21ఏళ్ళ యువ జవాన్ పేరేమిటో తెలుసా?? "జస్వంత్ సింగ్ రావత్ " కేవలం ఒక్కడే దాదాపు 72 గంటలు శత్రుసైన్యాన్ని అడుగుముందుకు వేయకుండా ఆపిన వీరుడు.150 మందికి పైగా చైనా జవానులను అంతమొందించిన వీరజవాన్ . శాంతిచర్చలలో భాగంగా అతని తలను భారత్ కు అప్పగించారు చైనా అధికారులు.అతని పోరాటానికి ఫిదా అయినట్లు చెప్పారు..........

జస్వంత్ సింగ్ రావత్ కు తవాంగ్ ప్రాంతంలో మందిరం కట్టి అతనిని దేవునిగా పూజిస్తున్నారిప్పటికీ అక్కడ ప్రజలు. సెరా,నూరాలకూ ఘాట్లు కట్టారు. ప్రతిరోజూ డ్యూటీలకు వెళ్ళే జవాన్స్ అతనికి దండం పెట్టుకొని వెళుతారు. జస్వంత్ సింగ్ ప్రత్యేకత ఏమిటంటే చనిపోయినా ఇప్పటికీ వివిధ అవార్డులు గెలుచుకోవడం. ఇంత గొప్ప స్థానం మరే సైనికుడికీ దక్కలేదు!!!!

ఇటువంటి మహా వీరుల జీవిత కథ లు మన చరిత్ర లో భాగం అవ్వాలని ,విద్యార్థులకి పాఠ్యంశాలు గా చేర్చి ,,దేశ భక్తి ,విధి పట్ల నిబద్దత పెంపొందించాలని మనసారా కోరుకుంటున్నా

 పరమ వీర చక్ర శ్రీ జస్వంత్ సింగ్ రావత్ జీ కి ఘన నివాళి ................ 


పేదరికం ప్రతిభకు అడ్డురాదు:శివన్
ఇస్రో కి చైర్మన్ 

  అన్ని సదుపాయాలు ఉన్నా తమ పిల్లలు సరిగా రాణించడం లేదని చాలా మంది తలిదండ్రులు బాధపడుతుంటారు.ఏ సదుపాయాలు లేక దుర్భర పేదరికంలో మగ్గుతున్న కుటుంబంలో జన్మించి పాఠశాల స్థాయిలో  మామిడికాయలు,కళాశాల స్థాయిలో కూరగాయలు అమ్మి చదువుకొన్న ప్రతిభాశాలి, మట్టిలో మాణిక్యం "ఇస్రో ఛైర్మన్ శివన్".కాలికి చెప్పులు లేవు.ఇంజనీరింగ్ వరకూ పంచెతోనే వస్త్రధారణ.ఆంగ్లం రాదు. అయినా ఆ మేథావి పట్టువదలక ఉన్నతస్థాయికి చేరాడు."శివన్" జీవితచరిత్ర నేటి తరం విద్యార్థులకు,యువతకు మార్గదర్శకం.
 
   భారత దేశం గర్వించదగ్గ వ్యక్తుల్లో ఇస్రో చైర్మన్ శివన్ ఒకరు. 1982 నుండి శివన్ ఇస్రోకి తన ఎనలేని సేవలని అందిస్తున్నారు. శివన్ బాల్యం గురించి చాలామందికి తెలియదు. కటిక పేదరికంలో పుట్టిన శివన్ ఇండియా లోని ప్రతిష్టాత్మకమైనటువంటి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో కి చైర్మన్ గా ఎలా  ఎదిగారో చూద్దాం.శివన్ పూర్తిపేరు కైలాసవదివు శివన్. 1957 ఏప్రిల్ 14 న తమిళ నాడు లోని కన్యాకుమారి డిస్ట్రిక్ లోని  మేళా సారకల్విలై అనే గ్రామం లో వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి. కైలాస వడివు మరియు చెల్లమ్ దంపతులకు శివన్ జన్మించాడు. శివన్ పదవ తరగతి వరకు పక్క గ్రామాలలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో తమిళ్ మీడియం లో చదివాడు. తన కుటుంబం నుండి బడికి వెళ్లినవారిలో శివన్ మొదటివాడు. శివన్ తండ్రి ఊరూరా తిరిగి మామిడికాయలు అమ్మేవాడు. శివన్ కి ఇద్దరు చెల్లెల్లు, ఒక సోదరుడు ఉండేవారు. కొన్నికొన్ని సార్లు బడి మానేసి తన తండ్రి తో మామిడి కాయలు అమ్మడానికి వెళ్లాల్సి వచ్చేది. ఆ క్రమంలో తనతో పాటు తన పుస్తకాల సంచిని కూడా తీసుకొని వెళ్ళేవాడు.

 పదవ తరగతి పూర్తయ్యాక శివన్ తండ్రి చదువు మాన్పించి తనతో పాటు పనికి తీసుకొని వెళ్లాలనుకున్నాడు. శివన్ కి మాత్రం పైచదువులు చదవాలని ఉండేది. ఆ విషయాన్ని తన తండ్రితో చెప్పడానికి భయపడి తన మేన మామ'షణ్ముగ వేల్' కి చెపుతాడు. మొత్తానికి శివన్ మేనమామ  తండ్రిని ఒప్పిస్తాడు. కానీ చదువుకి డబ్బు ఖర్చవుతుంది. అప్పటికే ఆరుగురు ఉంటున్న ఆ కుటుంబం కేవలం శివన్ తండ్రి పైనే ఆధారపడి ఉంది. తనకి వచ్చే కొద్ది పాటి డబ్బు ని శివన్ చదువుకి ఖర్చుచేస్తే ఆ కుటుంబం మొత్తం పస్తులువుండాల్సిన పరిస్థితి. ఇదంతా అర్థం చేసుకున్న శివన్ తన తండ్రికి వారసత్వంగా వచ్చిన కొద్దిపాటి పొలంలో తన తండ్రి సహాయంతో కూరగాయలు పండించడం స్టార్ట్ చేసాడు.

 కాలేజ్ కి వెళ్లేముందు ఆ కూరగాయలను కోసుకుని సంచిలో వేసుకొని కాలేజ్ కి వెళ్లి సాయంత్రం కాలేజ్ అయిపోగానే ఆ కూరగాయలు అమ్మి వచ్చిన డబ్బుని తన తండ్రికి ఇచ్చేవాడు. అలా తన చదువుకి కావాల్సిన డబ్బును తానే స్వయంగా సమకూర్చుకున్నాడు. 1980 లో మద్రాస్ ఇస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. శివన్ ఇంజినీరింగ్ చదివేటప్పుడు తన తండ్రి తనకిఉన్న పొలంలో సగం శివన్ చదువుకి అయ్యే ఖర్చులకోసం  అమ్మేశాడు. ఆటైంలో శివన్ కేవలం లుంగి చొక్కాతో "కాళ్ళకి చెప్పులు" కూడా లేకుండా ఇంజనీరింగ్ కాలేజ్ కి వెళ్ళేవాడు. తన తోటి విద్యార్థులు శివన్ అవతారం చూసి హేళన చేసేవారు. కాని శివన్ మాత్రం తనని హేళన చేసినాకూడా అవేమి పట్టించుకోకుండా అందరితో మంచిగ ఉండేవాడు.

 కొంత మంది ప్రొఫెసర్లు శివన్ ఆర్దిక పరిస్థితిని అర్థం చేసుకొని కొన్ని పాత పుస్తకాలని శివన్ కి చదువుకోడానికి ఇచ్చేవారు. శివన్ చిన్నప్పటి నుండి తమిళ్ మీడియం కావడంతో ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో కొన్ని కొన్ని ఇంగ్లీష్ పదాలు అర్థం కాకపోయేవి. తన స్నేహితుల దగ్గర వుండే ఇంగ్లీష్ డిక్ట్షనరి ని తీసుకొని తన నోట్స్ లో తనకి అర్థం కాని ఆంగ్ల పదాలకి తమిళ్లో అర్థం రాసుకొని  తనే స్వయంగా ఒక డిక్ట్షనరి ని తయారుచేసుకున్నాడు. శివన్ చదువులో మాత్రం ఎప్పుడూ ముందుండేవాడు. తరువాత 1982 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ ఇన్ ఎయిరోనాటిక్స్ ఇంజెనీరింగ్ పూర్తి చేశాడు. మాస్టర్స్ చేసే టైం లోనే మొదటిసారిగా శివన్ పాంట్ వేసుకున్నాడు. మాస్టర్స్ పూర్తి అయిన అదే సంవత్సరంలో ఇస్రో లో జూనియర్ ఇంజినీర్ గా జాయిన్ అయ్యాడు.

  పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికిల్ PSLV ప్రాజెక్టు లో శివన్ ముఖ్యపాత్ర పోషించాడు. శివన్ క్రయోజెనిక్ ఇంజెన్స్ ని 6డి ట్రాజెక్టరీ సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ ని తయారుచేశాడు. 2011 లో GSLV మరియు రీ యూజబుల్ లాంచ్ వెహికిల్ ప్రాజెక్టులలో తన ప్రతిభ చూపించాడు. 2015 ఫిబ్రవరి లో శివన్ అతని టీం 104 సాటిలైట్స్ ని ఒకే సారి PSLV-C37 లాంచింగ్ వెహికిల్ లో స్పేస్ లోకి పంపి రికార్డ్ సృష్టించారు. 1982 నుండి శివన్ ఇస్రో నిర్వహించిన అన్ని రాకెట్ ప్రోగ్రామ్స్ లో తన వంతు సహాయాన్ని అందించాడు. తరువాత ఇస్రో కి సంబందించిన లిక్విడ్ ప్రోపల్షన్ సిస్టమ్ సెంటర్ కి 2014 జులై 2 లో డైరెక్టర్ గా అపాయింట్ అయ్యాడు. 2015 జూన్ 1న విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ కి డైరెక్టర్ అయ్యాడు.

    2018 జనవరి లో శివన్ ని ఇస్రో కి చీఫ్ గా నియమించారు. అతని పర్యవేక్షణ లోనే ఇండియా చంద్రుడిపైకి పంపించే రెండవ మిషన్ అయినటువంటి చంద్రయాన్ 2 ని తయారుచేశారు.
   చంద్రయాన్ 2 కి మొత్తం 970 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. దురదృష్టవశాత్తు ఆ మిషన్ చివరి క్షణాల్లో చంద్రుడి పైన ల్యాండ్ అయ్యేముందు గ్రౌండ్ స్టేషన్స్ తో సిగ్నల్స్ కట్ అయింది. ఆ మిషన్ ఫెయిల్ కావడంతో శివన్ భారత ప్రధాని నరేంద్ర మోదీ ని కలిసినప్పుడు దుఃఖాన్ని ఆపుకోలేక కంట తడిపెట్టాడు. దానికి నరేంద్ర మోది శివన్ ని ఓదార్చారు. ఇంత వరకు ఏ ఇస్రో ఛెైర్మన్ కూడా మిషన్ ఫెయిల్ అయ్యిందని కంఠతడిపెట్టలేదు.
  డబ్బువిలువ తెలిసిన శివన్ ప్రధాని నరేంద్ర మోదీని చంద్రయాన్ 2 మిషన్ ఫెయిల్ అయినందుకు తనని క్షమించమని అడిగాడు.ఓ శాస్త్రవేత్త ప్రయోగ విఫలానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానిని క్షమాపణ కోరుట దేశ చరిత్రలోనే మొదటిసారి

     *చివరిగా ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి ఎదిగిన శివన్ ఒక ఆదర్శవంతమైన వ్యక్తి. రాబోయే రోజుల్లో ఇస్రో చైర్మన్ శివన్ చేసే ప్రయోగాల్లో ఎన్నో విజయాలు సాధించాలని కోరుకుందాం.........మన ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇలాంటి శివన్ లు ఎంతో మంది ఉండే ఉంటారు.ఇలాంటి స్ఫూర్తి దాయకమైన వ్యక్తుల జీవితాలను విద్యార్థుల కు తెలియచేయటం ద్వారా  అత్యున్నత శిఖరాలను అందుకునేందుకు నిబద్ధతతో కూడిన అకుంఠిత శ్రమ,కార్యదీక్ష, పట్టుదల వంటి లక్షణాలను అలవరచుకునే విధంగా నవతరాన్ని నిర్మిద్దాం.దేశప్రగతికి బాటలు వేయడంలో మనవంతుగా ముందుకు సాగుదాం.
                                    

 

  పుస్తకం పై ప్రముఖుల అభిప్రాయాలు 

 

 

ఒక కోటి రూపాయలు మీకు దొరికితే మీరేం చేస్తారు అని అడిగితే
ఒక గ్రంథాలయాన్ని కట్టేస్తా అన్నారు.
           - మహాత్మగాంధీ

ఎవరూ లేని ఒక దీవిలో మిమ్మల్ని ఒంటరిగా వదిలేస్తే ఏమి చేస్తారు అని అడిగితే
పుస్తకాలతో ఆనందంగా గడిపి రెట్టింపు సంతోషంతో తిరిగి వస్తా అన్నారు.
             - నెహ్రు

మరిచిపోకుండా నా సమాధిపైన రాయండి ఇక్కడ
పుస్తకాల పురుగు శాశ్వత నిద్రలో ఉన్నదని అన్నారు.
         - ఫెడ్రంట్ రసెల్

మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పారు.
          - ఆల్బర్ట్ ఐన్స్టెయిన్

ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు జైలులో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరారు
       -నెల్సన్ మండేలా

🔫 తుపాకీ కంటే పెద్ద ఆయుధం,
📘 పుస్తకం అన్నారు .
పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు
పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు  వచ్చి పడ్డాయంటా కానుకగా ఆ  వ్యక్తి
       - లెనిన్

📚 ఒక్కో చిత్రం నటించక తనకు వచ్చిన పారితోషికంతో మొదట 100 డాలర్లకు పుస్తకాలను కొనేవారు.
              -చార్లీ చాప్లిన్

ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే 📕 పుస్తకమే అన్నారు.
              - విన్స్టెన్  చర్చిల్

📚  భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవి అని అడిగినప్పుడు పుస్తకాలని చెప్పారు.
            -మార్టిన్ లుతెర్కింగ్

📖 తనకు ఉరివేసి క్షణం ముందు వరకు పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి.
                    - భగత్ సింగ్

          📖 నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసినవ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అన్నారు.
             - అబ్రహం లింకన్

📚 వెయ్యి పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటె చూపండి,
            అతడే నా మార్గదర్శి అన్నారు.
           -జూలియస్ సీసర్

           🌏 ప్రపంచపటంలో  కనిపించే ప్రతి మూలకు వెళ్లాలని ఆశపడుతున్నావా,  అయితే గ్రంథాలయానికి వెళ్ళమన్నారు.
                       -టెస్కార్డ్స్

         📘 జీవితం విరక్తి చెందినప్పుడు లేదాకొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నారు.
              -ఇంగర్సాల్

         🤸‍♀️వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో,
         అలా 📙పుస్తక పఠనం మనసుకు వ్యాయామం ఆరోగ్యం అన్నారు.
               -సిగ్మెంట్ ఫ్రాయిడ్

             📕 పుస్తక పఠనం అలవాటు ఉన్న వ్యక్తిని పరిపూర్ణ మనిషిగా మార్చేస్తుంది పుస్తకం అంటారు.

            ప్రముఖుల ఎందరికో వెలుగు పంచింది. వారిని వెలుగులోకి తెచ్చింది పుస్తకాలే

           📒 ముఖపుస్తకం పట్టుకుని నిజ పుస్తకాన్ని మరిచాము.
           📖చదవాలి అనే ఆలోచనాఆసక్తి ఉంటె చాలు ఎన్నో మంచి పుస్తకాలు వేలల్లో ఉన్నాయి చదవండి, చదివించండి .📚

  

దట్టమైన అడవిలో… చిక్కని చీకట్లో ఆ కుర్ర డాక్టర్… తొలి డెలివరీ కేసు…
 

 


1943… డాక్టర్ కులకర్ణి వయస్సులో చిన్నవాడే… హుబ్లీలో ఉంటాడు… తను ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు చందగఢ్ అనే ఊళ్లోని చిన్న హాస్పిటల్‌లో పోస్టింగ్ వచ్చింది… అది మహారాష్ట్ర- కర్నాటక బోర్డర్… ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి…
జూలై… తుఫాను రాత్రి… ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు… హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు… ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు… ఉన్ని బట్టలు కప్పుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు వ్యక్తులు మరాఠీలో చెప్పారు… ‘‘త్వరగా నీ బ్యాగ్ తీసుకుని మాతో నడువ్…’’

ఆయన నిశ్శబ్దంగా తన మెడికల్ కిట్ తీసుకుని వాళ్లతో కలిశాడు… గంటన్నర తరువాత ఎడ్లబండి ఆగింది… దట్టమైన చీకటి… గడ్డితో పైకప్పు వేయబడిన ఓ చిన్న ఇల్లు అది… లోపలకెళ్తే సన్నగా లాంతరు వెలుతురు… మంచంపై ఓ మహిళ… పక్కన ఓ ముసలామె…
అయోమయంగా చూశాడు డాక్టర్… ఆమె ఎవరు..? నన్నెందుకు తీసుకొచ్చారు..? వైద్యం కోసమేనా..? అదే నిజమైతే అక్కడే చెప్పొచ్చు కదా… ఈ నిర్బంధ ధోరణి దేనికి..? మర్యాదగా అడిగినా వచ్చేవాడు కదా… ‘ప్రసవం చేయాలి డాక్టర్’ అన్నాడు ఓ వ్యక్తి… ఆమె నొప్పితో గిలగిలలాడుతోంది… ఏం చేయాలో డాక్టర్‌కు బోధపడటం లేదు… తనలోని డాక్టర్ స్థిమితంగా లేడు… ఎందుకంటే..? తను అంతకుముందు ఎప్పుడూ డెలివరీ చేయలేదు… కానీ ఆమెకు ఎలాగైనా సాయపడాలని అనుకున్నాడు… డాక్టర్ కదా… ఊరుకోలేకపోయాడు…
నొప్పి డైవర్ట్ చేయడానికి మాటల్లో దింపాడు… ఆమెను అడిగాడు… ‘అసలు ఎవరు నువ్వు..? ఇక్కడికి ఎలా వచ్చావు..?’
‘డాక్టర్ సార్, నాకు బతకాలని లేదు… నేనొక భూస్వామి కూతురిని’ ఆమె గొంతులో ధ్వనిస్తున్న బాధ… ‘‘మా ఊళ్లో హైస్కూల్ కూడా లేదు… అందుకని నన్ను చదువు కోసం కాస్త దూరంగా ఉన్న పట్టణానికి పంపించారు… అక్కడ ఓ క్లాస్‌మేట్‌ను ప్రేమించాను… ఈ కడుపు ఆ ప్రేమ వల్లే… కడుపు విషయం తెలియగానే ఆ అబ్బాయి జంప్… నా తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు… కానీ అప్పటికే ఆలస్యమైంది… ఇంకేమీ చేయడానికి లేదు, అందుకని ఇక్కడ ఉంచారు… ఇటువైపు ఎవరూ రారు… నా కడుపు, నా బాధ ఎవరికీ తెలియదు, తెలియవద్దనే ఈ ఏర్పాటు…’’ అంటూ రోదించసాగింది…
డాక్టర్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు… మెల్లిమెల్లిగా తన సాయంతో ఆమె ఓ ఆడబిడ్డను ప్రసవించింది… కానీ ఆ బిడ్డ ఏడవడం లేదు… పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి ఆమె మళ్లీ ఏడుపు అందుకుంది… డాక్టర్ సార్, దాన్ని ఇక్కడే చంపేయండి… నా బతుకులాగే దానిది కూడా ఏడుపు బతుకు కావొద్దు ప్లీజ్…’
కులకర్ణి ఎలాగోలా తంటాలు పడ్డాడు కాసేపు… పిల్ల ఏడ్చింది… ఆ గదిని వదిలిపెట్టి బయటికి వచ్చాక ఆయనకు 100 రూపాయలు ఇవ్వబడ్డాయి… అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే… తన జీతమే 75 రూపాయలు… ఫీజు తీసుకున్నాడు, లెక్కపెట్టుకునేటప్పుడు తన మెడికల్ బ్యాగ్ గదిలోనే మరిచిపోయినట్టు గుర్తొచ్చింది… ఆ బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పి, గదిలోకి వెళ్లాడు… ఆ వంద రూపాయలు ఆ కొత్త తల్లి చేతుల్లో పెట్టాడు…
‘‘ఇప్పుడు ఎలాగూ సంతోషమో దుఖమో మన చేతుల్లో ఏమీ లేవు… జరిగిందేదో జరిగిపోయింది… అన్నీ మరిచిపో… నీ జీవితం నీది… ప్లాన్ చేసుకో… ప్రయాణానికి తగినంత ఓపిక వచ్చాక పూణె వెళ్లు, అక్కడ నర్సింగ్ కాలేజీ ఉంటుంది… అందులో నా దోస్త్ ఆప్టే ఉంటాడు… వెళ్లి కలువు, కులకర్ణి పంపించాడని చెప్పు… తను తప్పక సాయం చేస్తాడు… ఇది ఓ సోదరుడి సూచన అనుకో, సాయం అనుకో, ఇప్పుడైతే నేన్నీకు వేరే సాయం ఏమీ చేయలేను’’ అని ఆమె తలపై ఓదార్పుగా ఓసారి చేయి వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు…
ఏళ్లు గడిచాయి… కులకర్ణి ఇప్పుడు పలు రంగాల్లో నైపుణ్యం సంపాదించాడు… ఓసారి అనుకోకుండా ఓ మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఔరంగాబాద్ వెళ్లాడు… అక్కడ డాక్టర్ చంద్ర అనే లేడీ డాక్టర్ ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి బాగా అబ్బురపడ్డాడు… ప్రోగ్రాంలో అనుకోకుండా తన పేరు కులకర్ణిగా ప్రస్తావనకు వచ్చేసరికి డాక్టర్ చంద్ర చకచకా నేరుగా తన దగ్గరకు వెళ్లింది… ‘సర్, మీరు ఎప్పుడైనా చందగఢ్ వెళ్లారా..?’ అనడిగింది…
‘అవును, చాలా ఏళ్ల క్రితం.,. నాకు ఆ ఊరితో బంధముంది… అక్కడ కొన్నాళ్లు పనిచేశాను’
‘అయితే మీరు ఓసారి మా ఇంటికి వస్తారా ప్లీజ్…’
‘డాక్టర్ చంద్రా, మిమ్మల్ని తొలిసారి కలిశాను, మీ ప్రజెంటేషన్ సింప్లీ సూపర్బ్… నాకు బాగా నచ్చింది… కానీ ప్రస్తుతం మీ ఇంటికి రాలేను… మళ్లీ ఎప్పుడైనా తప్పకుండా మీ ఇంటికి వస్తాను, ఏమీ అనుకోవద్దు ప్లీజ్…’
‘సర్, దయచేసి ఒక్కసారి రండి, కాసేపు… మీ టైం ఎక్కువగా తీసుకోను, మీరొక్కసారి మా ఇంటికి వస్తే జీవితాంతం మిమ్మల్ని మరిచిపోను’
కులకర్ణి ఇక మాట్లాడలేకపోయాడు… ఆమె అంత ఇదిగా పిలుస్తుంటే ఎలా కాదనగలడు..? పైగా ఆమె పరిజ్ఞానం తనను ముగ్దుడిని చేసింది… ఆమె వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది… లోపలకు అడుగు పెట్టకముందే… ‘అమ్మా, మనింటికి ఎవరొచ్చారో ఓసారి చూడు…’ అని గట్టిగా పిలిచింది…
డాక్టర్ చంద్ర తల్లి బయటికి వచ్చింది… కులకర్ణిని చూడగానే కాసేపు తన కళ్లను తనే నమ్మలేకపోయింది… జలజలా కన్నీళ్లు కారిపోతున్నాయి అసంకల్పితంగా… ఆయన పాదాలపై పడింది… ఆమె కన్నీళ్లు కులకర్ణి పాదాలను తడిపేస్తున్నయ్… ఆయన గందరగోళంలో పడిపోయాడు… తరువాత ఆమె చెప్పింది…
‘ఆ రాత్రిపూట మీరు చందగఢ్ అడవిలో నాకు డెలివరీ చేశారు… ఆరోజు పుట్టింది ఈ బిడ్డే… మీరు చెప్పినట్టే పూణె వెళ్లాను, మీ మిత్రుడి సాయంతో చదువుకున్నాను… స్టాఫ్ నర్స్ అయ్యాను… నా బిడ్డను ఓ మంచి గైనకలాజిస్టును చేయాలనేది నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను… మీరే స్పూర్తి… ఆశీర్వదించండి సార్…’ అంది చేతులు జోడిస్తూ…
ఆనందం, ఆశ్చర్యం ఆయన్ని కమ్మేశాయి… తన తొలి డెలివరీ కేసు ఆమె… అదీ ఓ గడ్డు స్థితిలో… డాక్టర్ చంద్రను అడిగాడు… ‘ఇంతకీ నన్నెలా గుర్తించావు..?’
అనుకోకుండా మీ పేరు కులకర్ణి అని వినిపించేసరికి ఆశ్చర్యపోయాను… అమ్మ మీ పేరును రోజూ ఓ మంత్రంలా పఠిస్తూనే ఉంటుంది… సార్, మీ పూర్తి పేరు రామచంద్ర కులకర్ణి అని మీ మిత్రుడు చెప్పాడు… అందులో నుంచే నా బిడ్డకు చంద్ర అని పేరు పెట్టుకున్నాను… ఆమెకు జీవితం ప్రసాదించింది మీరే… మీరే ఆదర్శంగా పేద మహిళలకు ఫ్రీ డెలివరీ, ఫ్రీ వైద్యం నా బిడ్డ అలవాటు చేసుకుంది… ఎన్నో కేసులు, ఎందరికో ప్రాణం పోసింది… సార్, ఈమె స్పూర్తి రీత్యా మీ బిడ్డే…’ ఆమె చెబుతూనే ఉంది…
ఇప్పుడు ఆయన కళ్లల్లో ఎందుకో నీళ్లు… ఆగడం లేదు… జారుతున్న తడిని తుడుచుకోవాలని కూడా లేదు… కొన్నిసార్లు కన్నీళ్లు అలా మత్తడి దూకాల్సిందే… చెప్పనేలేదు కదూ… ఈ డాక్టర్ కులకర్ణి ఎవరో తెలుసా..? ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త, ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధామూర్తికి స్వయానా తండ్రి
 
 
ప్రముఖ వ్యాపార దిగ్గజం, టాటా సన్స్ మాజీ చైర్మన్ రతన్ టాటా .




ప్రతి భారతీయుడికి స్ఫూర్తి నింపే జీవితం
     
పది వేల కోట్ల రూపాయలుగా ఉండవలిసిన ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని ఒకే ఒక్కడు తన యుక్తితో, తన వ్యాపార నిపుణతతో ఆరు లక్షల కోట్లకు ఎగబాకేలా చేశారు. దాదాపు ఏడు లక్షల మందికి ఉపాధినిస్తూ,నూట యాభై ఏళ్ళ చరిత్ర కలిగిన టాటా గ్రూప్ ను అందనంత ఎత్తులో నిలబడేలా చేశారు. నేడు ఉప్పు నుండి ఉక్కు వరకు టీ నుండి ట్రక్కుల వరకు ఇలా ప్రతి వ్యాపారంలో లోను ఖచ్చితంగా TATA పేరు వినిపిస్తుంది.ఇంతటి ఘన చరిత్రను టాటా గ్రూప్ కు కట్టబెట్టేలా చేశారు అతను. అతనే రతన్ టాటా. కొన్ని కోట్ల మంది భారతీయులకు ఆదర్శప్రాయులు ఈ జీవన విజేత.

1937 డిసెంబర్ 28 న దేశంలోనే ధనిక కుటుంబంలో జన్మించారు రతన్. ఏడేళ్ల వయసులోనే తల్లి తండ్రులిద్దరూ విడిపోవటంతో నాయనమ్మ దగ్గర పెరగవలిసి వచ్చింది. తన చదువును అమెరికాలోనే పూర్తి చేసుకొని J.R.D టాటా పిలుపు మేరకు జంషెడ్ పూర్ లోని టాటా స్టీల్ కంపెనీలో అప్రెంటీస్ గా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు రతన్. ఎప్పటికప్పుడు  కొత్త కొత్త ఆలోచనలతో, తన నైపుణ్యంతో టాటా కంపెనీలో ఒక ఉత్తమ ఉద్యోగిగా ఎదిగగలిగారు రతన్. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు ఉద్యోగిగా పనిచేసిన తరువాత 1991 లో J.R.D టాటా నుండి టాటా గ్రూప్ చైర్మన్ గా భాద్యతలు స్వీకరించారు రతన్. అప్పట్లో ఈ నిర్ణయాన్ని బోర్డు అఫ్ మెంబెర్స్ లో చాలా మంది వ్యతిరేకించారు. అనుభవం లేని రతన్ చేతిలో ఇన్ని కోట్ల వ్యాపార సామ్రాజ్యం నడవలేదని అందరు వాదించారు. కానీ వారికి ఆనాడు తెలియదు పాపం ఇతడే టాటా గ్రూప్ ను దశదిశలా వ్యాపించే ఘనుడు అవుతాడని.

➢ చైర్మన్ గా రతన్ టాటా
చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తరువాత టాటా గ్రూప్ లో సమూల ప్రక్షాళన చేశారు రతన్. రాత్రి పగలు కష్టపడి పది వేల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని తన అసాధారణ వ్యాపార నైపుణ్యంతో ఆరు లక్షల కోట్ల విలువ చేసే కంపెనీగా మార్చారు రతన్. దేశ వాణిజ్య , పారిశ్రామిక పురోగతిలో కీలక పాత్ర పోషించారు. నేడు టాటా గ్రూప్ 90 కి పైగా దేశాలలో విస్తరించి వందకు పైగా వ్యాపారాలలో తన ముద్రను వేసి, దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యుత్తమ కంపెనీలలో ఒకటిగా నిలబడింది. వ్యాపార సామ్రాజ్యంలో ఒక శిఖరంగా ఎదగగలిగింది.ప్రతి  మధ్య తరగతి వాడికి సొంతంగా ఒక కారు ఉండాలనే ఉద్దేశంతో కేవలం లక్ష రూపాయలకే  టాటా నానో కారును మార్కెట్లోకి తెచ్చి పెను సంచలనాన్నే సృష్టించాడు రతన్.

➢ నానో కారు ఓ సంచలనం:
టాటా గ్రూప్ భారతదేశానికి ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేసింది. నేడు ఎయిర్ ఇండియా గా పిలబడుతున్న విమానయాన సంస్థను మొదట టాటాఎయిర్ లైన్స్ పేరుతో 1868 లో జంషెడ్ జీ టాటా స్థాపించారు. కాలక్రమంలో అది కాస్త ప్రభుత్వం చేతిలోకి వెళ్ళింది. అలాగే భారత దేశంలో మొట్టమొదటి హోటల్ అయిన తాజ్ హోటల్ ను ప్రారంభించింది కూడా టాటాలే. బ్రిటన్ కు చెందిన Tetley అనే కంపెనీని టాటా టీ లో కలుపుకొని  ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టీ కంపెనీ గా టాటా టీ ఎదిగింది. అంతే కాదు మనల్ని పాలించిన బ్రిటిషర్లకే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగాడు రతన్ టాటా. ఎన్నో విదేశీ కంపెనీలను టాటా గ్రూప్ లో కలుపుకొని టాటా ను ఒక మహా సామ్రాజ్యంగా ఎదిగేలా చేశారు.

➢ రతన్ టాటాకు అవమానాలు, అవరోధాలు
1998 లో టాటా  ఇండికా కార్లను ప్రవేశ పెట్టారు. అయితే దురదృష్టవశాత్తు ఆ కార్లు మొదటి సంవత్సరంలోనే ఫెయిల్ అవటంతో రతన్  టాటా ఇండికా కార్ల వ్యాపారాన్ని అమ్మేయాలని భావించారు. ఇందుకోసం అమెరికాలోని ఫోర్డ్ కంపెనీకి తన టీం తో పాటు రతన్ టాటా కూడా వెళ్లారు. అయితే ఫోర్డ్ కంపెనీ చైర్మన్,రతన్ టాటా ను మీకు కార్లు ఎలా తయారు చేయాలో తెలియనప్పుడు కార్ల బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేసారు అని అవమానించారు. ఈ సంఘటనతో ఆ డీల్ మాట్లాడకుండానే వెనుదిరిగి వచ్చేసారు. కొన్ని సంవత్సరాల తరువాత టాటా ఇండికా నష్టాలనుండి లాభాలలోకి రావటం మొదలు పెట్టింది.కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా , అదే సమయంలో ఫోర్డ్ కంపెనీకి చెందిన జాగ్వార్ ,లాండ్రోవర్ కార్లు భారీగా నష్టాల్లోకి వెళ్లిపోయాయి. ఆ సమయంలోనే రతన్ ఆ రెండు కంపెనీలను నేను కొంటాను అని ఫోర్డ్ కంపెనీకి ఆఫర్ చేశారు రతన్. అప్పుడు ఫోర్డ్ కంపెనీ చైర్మన్ తన టీం తో అమెరికా నుండి ముంబై కు వచ్చారు. ఆ విధంగా తనను అవమానించిన వారికే గుణపాఠం చెప్పారు రతన్.

నానో కార్ల ఉత్పత్తి కోసం పశ్చిమ బెంగాల్ లో ఏర్పాటు చేసిన ప్లాంటును అక్కడి రైతులు వ్యతిరేకించడంతో ,ఆ ప్లాంటు మరొక చోటుకు మార్చటంతో వేల కోట్ల నష్టాన్ని చూడవలసి వచ్చింది.

పాకిస్థాన్ ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న తాజ్ హోటల్ పై జరిపిన ఉగ్ర దాడిలో వందల మంది అతిథులను, తమ ఉద్యోగస్థులను పోగొట్టుకోవాల్సివచ్చింది. ఈ సంఘటన రతన్ ను మానసికంగా ఎంతో బాధించింది.

➢ రతన్ టాటా  ఒక గొప్ప దానశీలి
లక్షల కోట్ల విలువ చేసే కంపెనీలకు అధిపతులైనా టాటా వంశీయులు ఇంతవరకు ఏనాడూ ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో నిలవలేదు. ఎందుకంటే టాటా గ్రూప్ నుండి వచ్చే లాభాలలో 66శాతం టాటా ట్రస్టులకు విరాళంగా ఇవ్వటం జరుగుతుంది. దేశ సామజిక పరిస్థితులు మెరుగుపరచటానికి టాటా ట్రస్టులు ఎంతగానో కృషి చేస్తున్నాయి.తాజ్ ఉగ్ర దాడిలో నష్టపోయిన వారికి అన్ని విధాలా సహాయమందించాడు రతన్. బ్రహ్మచారిగా ఉంటూ నలుగురి బాగు కోసం బతుకుతున్న మహనీయుడు రతన్ టాటా. తన ప్రతిభను మెచ్చి పలు దేశాలలోని యూనివర్సిటీలు తనను గౌరవ డాక్టరేట్లతో సత్కరించాయి. అంతే కాదు భారత ప్రభుత్వం పద్మ భూషణ్, పద్మ విభూషణ్ లతో రతన్ ను గౌరవించింది.

కోట్లకు అధిపతి అయినా ఏనాడూ కుసుమంత గర్వాన్ని కూడా ప్రదర్శించలేదు రతన్ టాటా. 86 ఏళ్ళ వయసులోనూ సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటూ కోట్ల మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నాడు రతన్.నేడు రతన్ టాటా అంటే ఒక వ్యక్తి కాదు,ఒక సంస్థ , ఒక బ్రాండ్. వీటన్నిటికీ మించి సృజనాత్మకత , దార్శనికత ఉన్న ఒక గొప్ప మానవతావాది. నేడు 130 కోట్ల మంది భారతీయులు మనసారా సగర్వంగా ఇతడు మా భారతీయుడు అని చెప్పుకునే వారిలో ముందు వరుసలో ఉంటారు రతన్ టాటా. అతని సాగించిన జీవన ప్రయాణం నేడు మనందరికీ స్ఫూర్తిదాయకం.


No comments:

Post a Comment

utf veeravasaram team

UTF VEERAVASARAM  మండల కార్యదర్శి వర్గ సభ్యులు 2019

 

గౌరవాధ్యక్షులు  

 Ch కుమార్ బాబ్జీ  

 M P P S ,MUTHRASI GUDEM         9949151934
అధ్యక్షులు  

K నాగ మునేశ్వరరావు 

M P P S NADAPANA VARI PALEM 9491625436
సహాధ్యక్షులు 

M M Ch శ్రీనివాసరావు   

M P P S MAIN TOLERU 887939358
సహాధ్యక్షురాలు

G శ్రీలక్ష్మి

M P P S,UTTARAPALEM 8790252456
ప్రధాన కార్యదర్శి 

D.పుల్లారావు 

M P P S NO:2 RAYAKUDURU 9491720541
కోశాధికారి 

A జాన్సన్ 

Z P H S MATSYAPURI 9652690398
కార్యదర్శులు  B.అచ్చియ్య    M P P S UTTARAPALEM/TOLERU 9441448707
  A రవి కుమార్    M P P S, J.R.PETA 9494708170
  N నరసింహ రాజు  M P P S PADAMATI PALEM
9492242225
  M దుర్గారావు  M P P S CHINAPETA/VVRM 9492566512
  N భాను మహేష్  Z P H S DUSANAPUDI 9989482899
  G  V రమణ M P P S ,Ch GARUVU 9441752134
  A మాధవరావు M P U P S ,PANJA VEMAVARAM 8919220152
  M S సూర్యచంద్ర కుమార్ M P P S MENTEPUDI 9490928865
  P సత్యనారాయణ M P P S (A A) MATSYAPURI 7013065862
ఆడీట్ కన్వీనర్  L V V S శర్మ  M P P S K V STREET/RKD 9491721636
జిల్లా కౌన్సిలర్స్   K నాగ మునేశ్వరరావు  M P P S NADAPANA VARI PALEM 9491625436
  D.పుల్లారావు  M P P S NO:2 RAYAKUDURU 9491720541
  Ch కుమార్ బాబ్జీ   M P P S ,MUTHRASI GUDEM 9949151934
  P నరసింహరావు  Z P H S, KONITHIWADA 9866909357
  p సాయిబాబు   Z P H S VEERAVASARAM 9652801014
  B కృష్ణారావు  M P P S MAIN KONITHIWADA 9491173702
  P హరేకృష్ణ  Z P H S ANDALURU 8985497896
రాష్ట్ర కౌన్సిలర్ Ch కుమార్ బాబ్జీ   M P P S ,MUTHRASI GUDEM 9949151934 
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు    G V V రామానుజారావు    9490831997

 

APTET OCTOBER 2025

  AP TET OCTOBER 2025 NOTIFICATION   PRESS NOTE 2025   టెట్ షెడ్యూల్: టెట్ నోటిఫికేషన్ విడుదల : 24.10.2025 పరీక్ష ఫీజు చెల్లింపు: 24.10.2...